జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి బీసీలకు కేటాయించాలి
NEWS Jan 21,2025 12:09 pm
కోరుట్ల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ రాష్ట్ర కన్వీనర్ గోనె ప్రసాద్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. అత్యధిక జనాభా కలిగిన బీసీలు ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారన్నారు. సుదీర్ఘకాలంగా జెండా మోసిన పదవులలో మాత్రం అణచివేతకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.