కోరుట్ల పట్టణంలోని వార్డు సభలో పాల్గొన్న కలెక్టర్
NEWS Jan 21,2025 12:10 pm
కోరుట్ల పట్టణంలోని 2వ వార్డులో జరిగిన వార్డు సభలో కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతుభరోసా, కొత్తరేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాలను ప్రవేశపెట్టిందని, అర్హులైన వారు వార్డు, గ్రామసభల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో జివాకర్ రెడ్డి, కమిషనర్ తిరుపతి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.