భావనపాడులో పెట్రో కెమికల్ హబ్
NEWS Jan 21,2025 11:59 am
దావోస్ వేదికగా కీలక ప్రకటన చేశారు మిట్టల్ గ్రూప్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్. ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఏపీలోని భావనపాడులో పెట్రో కెమికల్ హబ్ ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అంతే కాకుండా సోలార్ సెల్ తయారీ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తామన్నారు.