భారత్ స్కౌట్స్ & గైడ్స్ వేడుకలు ప్రారంభించిన సీఐ నిరంజన్ రెడ్డి
NEWS Jan 21,2025 12:08 pm
మెట్ పల్లి పట్టణంలోని అక్షర హైస్కూల్లో భారత్ స్కౌట్స్ & గైడెన్స్ వేడుకలను మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ప్రస్తుత సమాజంలో విద్యార్థులు క్రమశిక్షణతో, నీతి నిజాయితీతో, విలువలతో కూడిన విద్యను అభ్యసించి సమాజంలో మంచి పౌరులుగా ఉండాలని సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఇఓ చంద్రశేఖర,మెట్ పల్లి ఎస్సై కిరణ్ కుమార్, జిల్లా స్కౌట్ అధికారులు మధుసూదన్, వినోద్, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.