అక్షర హైస్కూల్లో భారత్ స్కౌట్స్ & గైడ్స్ ప్రారంభోత్సవ వేడుక
NEWS Jan 21,2025 12:05 pm
మెట్ పల్లి: అక్షర హైస్కూల్లో భారత్ స్కౌట్స్ & గైడ్స్ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా మెట్ పల్లి సిఐ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో విద్యార్థులు క్రమశిక్షణతో, నీతి నిజాయితీతో, విలువలతో కూడిన విద్యను అభ్యసించి సమాజంలో మంచి పౌరులుగా ఎదగాలని సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఇఓ చంద్రశేఖర రావు తదితరులు పాల్గొన్నారు.