బుచ్చయ్యపేట మండలం పి.భీమవరం వాకాడి చెరువు వద్ద మంగళవారం గడ్డి లోడుతో ఉన్న ట్రాక్టర్ దగ్ధమైంది. నేతవానిపాలెంకి చెందిన వియ్యపు కొండారావుకి సంబంధించిన వరికుప్ప నూర్పిడి యంత్రం సాయంతో నూర్చారు. నూర్పిడి యంత్రం నుంచి అగ్గి రవ్వలు చెలరేగి వరిగడ్డికి మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగి ట్రాక్టర్ తొట్టితో సహా కాలి బూడిదయింది. పక్కనే ఉన్న గడ్డి కుప్ప కూడా కాలిబూడిదయ్యింది