పెట్టుబడిదారులకు భారీగా రాయితీలు
NEWS Jan 21,2025 11:27 am
సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనలో బిజీగా ఉన్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో సమావేశం అయ్యారు. 15కు పైగా సమావేశాల్లో వివిధ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు. గ్రీన్ హైడ్రోజన్ - గ్రీన్ మాన్యుఫాక్చరింగ్, నెక్స్ట్ పెట్రోకెమికల్ హబ్, ఎనర్జీ ట్రాన్సిషన్, బ్లూ ఎకానమీపై సదస్సులు కొనసాగాయి. సింగపూర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గాన్ కిమ్ యాంగ్, యూఏఈ ఎకానమీ మినిస్టర్తో ములాఖత్ అయ్యారు.