రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా కోరుట్ల పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో జగిత్యాల జిల్లా డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ శ్రీనివాస్, ఆర్టీసీ డిపో మేనేజర్ మనోహర్ ప్రజలకు రోడ్డు భద్రతపై ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ ప్రమాదాలపై తగు జాగ్రత్తలపై వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు వారి పాటలతో ప్రజలను చైతన్యపరిచారు.