వడ్డాది నుండి నర్సీపట్నం రహదారి
NEWS Jan 21,2025 11:37 am
వడ్డాది నుండి నర్సీపట్నం రహదారి ఈ నెలాఖరికి ప్రారంభం కానుందని జనసేన ఇంచార్జ్ PVSN రాజు తెలిపారు. నర్సీపట్నం నుండి వడ్డాది వరకు గల రహదారి అత్యంత దుర్భరంగా మారి గత కొన్నేళ్ళ నుంచి స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ రహదారి గురించి గతంలో ఎన్నో పోరాటాలు, నిరసన దీక్షలు చేసామని, చివరికి మన కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ సమస్య పరిష్కారం కాబోతుందని, ఈ నెలాఖరులోగా ఈ రహదారి నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయని చెప్పారు.