జగిత్యాల జిల్లా కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో జగిత్యాల జిల్లా శ్రీనివాస మిత్రుల మొదటి వార్షికోత్సవం నిర్వహించారు. జగిత్యాల జిల్లా శ్రీనివాసుల గ్రూప్ అడ్మిన్ వూట్కూరి శ్రీనివాస్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ వార్షికోత్సవానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 300 మందికి పైగా శ్రీనివాసులు తరలివచ్చారు. అనంతరం రక్తదాన శిబిరం ప్రారంభించి తలసేమియా భాదితులకు రక్తదానం చేశారు.