పోగొట్టుకున్న ఫోన్ నుండి రూ.1,57,000 మాయం
NEWS Jan 21,2025 10:38 am
ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామానికి చెందిన రణదీశ్ ఈనెల15న మెట్ పల్లి నుంచి ఆర్మూర్ వెళ్తుండగా బస్సులో అతని ఫోన్ పోయిందని. ఆ తర్వాత అతని అకౌంటు నుంచి ఫోన్ పే ద్వారా విడతల వారీగా రూ.1,57,000 తస్కరణకు గురైనట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మెట్ పల్లి ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు.