హెల్మెట్ ధరించి ప్రాణాలను కాపాడుకోండి
NEWS Jan 21,2025 11:39 am
హెల్మెట్ ధరించి ప్రాణాలను రక్షించుకోవాలని మడకశిర అర్బన్ సీఐ రాగిరి రామయ్య అన్నారు. మడకశిర పట్టణంలో ఎస్పి రత్న, డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు అర్బన్ రాగిరి రామయ్య ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది జూనియర్ కళాశాల విద్యార్థులు , ఉపాధ్యాయులతో కలిసి ప్రతి ఒక్కరు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి ప్రాణాలను రక్షించుకోవాలని జూనియర్ కళాశాల నుండి అమరాపురం బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు.