ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన గ్రామసభకు స్పెషల్ ఆఫీసర్ రాకపోవడంతో గ్రామ ప్రజలు సభ వద్దకు వచ్చిన కొంతమంది తిరిగి వెళ్లిపోయారు. స్పెషల్ ఆఫీసర్ సమయ పాలన పాటించకుండా కథలాపూర్ మండలం దులూరు గ్రామంలో స్పెషలాఫీసర్ మిషన్ భగీరథ ఏఈ అనిల్ రాకపోవడంతో ఆలస్యంగా ప్రజాపాలన గ్రామసభ జరిగింది. స్పెషల్ ఆఫీసర్ దగ్గరుండి చూసుకోవాల్సిన పనులను ఆలస్యం చేయడం వల్ల గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.