ఏపీ రాష్ట్రం 2047 విజన్ దిశగా ముందుకు సాగుతోందని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు. అమెరికాలో స్విస్ పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో మ్యానుఫ్యాక్చరింగ్, ఆర్అండ్డీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి అనుకూల వాతావరణం ఉంటుందన్నారు. యూనిట్లు ఏర్పాటు చేసే సంస్థలకు 15 రోజుల్లో అన్ని అనుమతులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు చంద్రబాబు.