వార్డు సభలను సద్వినియోగం చేసుకోండి
NEWS Jan 21,2025 04:08 am
బెల్లంపల్లి పట్టణంలో నేటి నుంచి 23వ తేదీ వరకు వార్డు సభలు నిర్వహిస్తున్నామని మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేత తెలిపారు. వార్డు గ్రామ సభలో కొత్త రేషన్ కార్డులు, నూతన ఇందిరమ్మ ఇళ్లు, మీసేవ కేంద్రాల్లో రేషన్ కార్డుల్లో పేర్లు యాడ్ చేసుకున్న పేర్లు వార్డు సభలో ప్రకటిస్తారన్నారు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.