ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న పనులకు ఆమోదం తెలపాలని, నిధులను మంజూరు చేయాలని కోరారు. మంత్రికి వినతిపత్రం సమర్పించారు. తమ ప్రభుత్వం ఇప్పటి వరకు ఇచ్చిన ఆరు హామీలకు ప్రయారిటీ ఇస్తున్నామని తెలిపారు.