మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోరుతూ ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో జరగబోయే వెయ్యి గొంతులు లక్ష డప్పులు కార్యక్రమానికి మాదిగ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాదిగ కళాకారుల అధ్యక్షుడు మారంపెల్లి శ్రీధర్, మాట్ల బూచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.