కడియం శ్రీహరి 100 కోట్ల అమ్ముడు పోయి కాంగ్రెస్ పార్టీలో చేరారని స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపించారు. వెలేరులో నిర్వహించిన రైతు ధర్నాలో పాల్గొన్న రాజయ్య మాట్లాడుతూ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై మరో పక్క కడియం శ్రీహరి పై గుర్రుగా ఉన్నారని చెప్పారు.