ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. కేంద్ర మంత్రి అమిత్ షాపై భగ్గుమన్నారు. తను మాట్లాడిన మాటలను చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతుందన్నారు. వైసీపీ పాలన ఓ విపత్తు అయితే , ఆ ఐదేళ్లు విధ్వంసం జరుగుతుంటే ఢిల్లీలో కూర్చుని ఏం చేశారంటూ ప్రశ్నించారు. నిద్ర పోయారా అంటూ నిలదీశారు. ఆ ఐదేళ్లు కేంద్రంలో మీరే కదా ఉన్నదంటూ మండిపడ్డారు.