కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
NEWS Jan 20,2025 05:10 pm
మెట్ పల్లి ఎంపీడీవో కార్యాలయంలో మంజూరైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, ఏఎంసీ చైర్మన్ కూన గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 12 మంది లబ్ధిదారులకు రూ.12,01,392 విలువైన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మహేశ్వర్, తాసిల్దార్ శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కూన గోవర్ధన్, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.