జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్
NEWS Jan 20,2025 05:13 pm
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. కక్ష సాధింపు చర్యలకు తాను ఏనాడూ పాల్పడలేదన్నారు. రివెంజ్ పాలిటిక్స్ ఏ పార్టీకి మంచిది కాదన్నారు. అలా చేసిన వాళ్లు అడ్రస్ లేకుండా పోవడం ఖాయమన్నారు. గతంలో ఉమ్మడి ఏపీకి సీఎంలుగా పని చేసిన వైఎస్సార్, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్యలు ఏనాడూ కక్ష సాధింపులకు పాల్పడలేదని అన్నారు. తనకు నష్టం చేసినా నేను ఎవరికీ నష్టం చేయలేదన్నారు.