డిజిటల్ దినపత్రిక రంగంలో నేటి ఉదయం తెలుగు డిజిటల్ దినపత్రిక దూసుకెళుతుందని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ అన్నారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్ లో నేటి ఉదయం తెలుగు డిజిటల్ దినపత్రిక 2025 క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి ఉదయం దినపత్రికను మూడేళ్ల క్రితం ప్రారంభించారని ప్రతి రోజు నేటి ఉదయం దిన పత్రికకు పాఠకుల సంఖ్యను పెంచుకుంటుందన్నారు. అనతి కాలంలోనే అందరి మన్ననాలను పొందుతుందని తెలిపారు.