బాధితులకు మాజీ ఎంపీ, ఎమ్మెల్యే పరామర్శ
NEWS Jan 20,2025 07:55 pm
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మాలెపూర్ ఘాట్ వద్ద ఐచర్ వ్యాన్ లోయలో పడి గాయపడ్డ వారిలో ఇద్దరు మృతిచెందారు. రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సోమవారం మాజీ ఎంపీ సోయం బాపూరావు, మాజీమంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్ పరామర్శించారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులు కుమ్ర మల్కు, తొడసం నాగు బాయి మృతిచెందింది. గుడిహత్నూర్ మండలం సూర్యగూడ నుండి 60మంది ఆదివాసులు జంగు భాయ్ పుణ్యక్షేత్రానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది.