సిఎం రేవంత్ రెడ్డి ఎఫ్అర్బిఎం పరిధిని దాటి విపరీత అప్పులు చేస్తున్నారని, ఇన్ని అప్పులు చేసినప్పటికీ కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేక పోతున్నారని BJP శాసన సభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ బిజెపి జిల్లా కార్యాలయంలో రాజ్యాంగ సంవిధాన గౌరవ ధివాస్ పై వర్క్ షాప్ అనంతరం మీడియాతో మాట్లాడారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంను సీఎం రేవంత్ అప్పుల కుప్పగా మార్చారని మండి పడ్డారు.