మార్పులు చేర్పులపై నేటి నుంచి సర్వే ప్రారంభం
NEWS Jan 20,2025 08:05 am
గతంలో జారీ చేసిన రేషన్ కార్డులలో అదనంగా పేర్ల నమోదు, ఇతర మార్పులకు సంబంధించి వచ్చిన దరఖాస్తులపై క్షేత్ర స్థాయిలో సోమవారం నుంచి పరిశీలన మొదలైంది. నిజామాబాద్ జిల్లాలో రేషన్ కార్డులలో మార్పులు చేర్పులకు సంబంధించి 77,758 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న దరఖాస్తుల స్థితిగతులను రెవెన్యూ అధికారులు తెలుసుకుని పౌర సరఫరాల శాఖకు నివేదించనున్నారు. ఐదారేళ్లుగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులకు మోక్షం లభించనుంది.