కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో 500 రూపాయల నకిలీ నోట్లు కలకలం రేపాయి. మండలంలోని చద్మల్ తండాలో ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చద్మల్ తండాలో గల లక్ష్మమ్మ ఆలయంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి ముందు 3 రోజుల పాటు జాతర నిర్వహిస్తారు. జాతర సందర్భంగా అమ్మవారికి భక్తులు హుండీలో కానుకలు చెల్లించుకుంటారు. హుండీ ఆదాయం లెక్కింపులో వచ్చిన నగదును దేవాలయం నిర్వహణ కోసం తండా వాసులకు తక్కువ వడ్డీకి అప్పుగా ఇస్తారు. ఈసారి కూడా గ్రామానికి చెందిన వ్యక్తికి అప్పు ఇచ్చారు.