అర్హులందరికీ రేషన్ కార్డులు మంజూరు
NEWS Jan 20,2025 03:54 am
అర్హులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని 30వ వార్డ్ కాంగ్రెస్ ఇంచార్జీ ఎంబెరి సత్యనారాయణ అన్నారు. కోరుట్ల నియోజకవర్గం పార్టీ ఇంచార్జీ జువ్వాడి నర్సింగరావు, జువ్వాడి కృష్ణారావు ఆదేశాల మేరకు చేపట్టిన నూతన రేషన్ కార్డుల సర్వేలో ఎంబెరి సత్యనారాయణ పాల్గొన్నారు. నర్సింగరావు సహకారంతో అర్హులందరికీ ఖచ్చితంగా రేషన్ కార్డులు మంజూరు చెపిస్తానన్నారు. మా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీలు అమలు చేస్తుందన్నారు.