కాంగ్రెస్ సర్కార్ పై నిప్పులు చెరిగారు ఈటెల రాజేందర్. అవినీతికి కేరాఫ్ గా మారి పోయిందన్నారు. ఏకంగా ఓ మంత్రి భార్య దుకాణం ఓపెన్ చేసిందన్నారు. బిల్లులు విడుదల చేసేందుకు 7 నుండి 10 శాతం కమీషన్ తీసుకుంటోందని ఆరోపించారు. మళ్లీ వస్తామో రామో.. దొరుకుతదో దొరకదో అన్న పద్దతిలో దోచుకుంటున్నారంటూ ధ్వజమెత్తారు ఈటెల. ఆర్థిక శాఖలో చేతులు తడపనిదే బిల్లులు పాస్ కావడం లేదని ఫైర్ అయ్యారు.