సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. అక్కడ జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటారు. ప్రపంచంలోని 130 దేశాలకు చెందిన దేశాధినేలతో పాటు 3,000 మంది ప్రముఖులు హాజరవుతారు. ఈ సందర్బంగా వివిధ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు నాయుడు భేటీ అవుతారు. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తారు.