ఢిల్లీ వేదికగా తొలిసారిగా జరిగిన ఖో ఖో ప్రపంచ కప్ ను భారత మహిళా, పురుష జట్లు చేజిక్కించుకున్నాయి. ఇరు జట్లు ఫైనల్ లో నేపాల్ జట్లను ఓడించాయి. ఈ సందర్బంగా జట్లను అభినందించారు మంత్రి రాం ప్రసాద్ రెడ్డి. దేశం గర్వించేలా అద్భుతంగా ఆడారంటూ కితాబు ఇచ్చారు. విశ్వ విజేతలుగా నిలవడం తనకు మరింత సంతోషాన్ని కలిగించిందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని కోరారు.