నేటి నుంచే దావోస్ సదస్సు
NEWS Jan 19,2025 07:53 pm
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు ఈనెల 20 నుంచి మూడు రోజుల పాటు దావోస్ లో జరగనుంది. ప్రపంచంలోని 130కి పైగా దేశాల ప్రతినిధులు, ప్రముఖులు, దేశాధినేతలు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. భారత దేశం నుంచి ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి హాజరవుతారు. మొత్తం 3,000 మంది ప్రముఖులు పాల్గొంటారని అంచనా.