ఖోఖో వరల్డ్ కప్ మెన్స్ టీం కైవసం
NEWS Jan 19,2025 07:19 pm
ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో తొలిసారి నిర్వహించిన ఖోఖో ప్రపంచ కప్ ను భారత మహిళా జట్టుతో పాటు పురుషుల జట్టు గెలుపొందాయి. ఇరు జట్లు నేపాల్ జట్లను ఓడించాయి. ఈ టోర్నమెంట్లో పురుషులు, మహిళల విభాగాల్లో 39 జట్లు పాల్గొన్నాయి. పురుషుల పోటీలో 20 జట్లు నాలుగు గ్రూపులుగా విభజించబడ్డాయి, మహిళల విభాగంలో 19 జట్లు నాలుగు విభాగాలుగా విభజించబడ్డాయి. ఈ సందర్బంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జట్లను అభినందించారు.