భారత మహిళా ఖోఖో జట్టు అరుదైన ఘనత సాధించింది. తొలిసారిగా జరిగిన ఖోఖో ప్రపంచ కప్ ను గెలుపొందింది. నేపాల్ జట్టును ఫైనల్ లో ఓడించి సత్తా చాటింది. ప్రత్యర్థి జట్టును 78-40 భారీ తేడాతో ఓడించింది. టోర్నీ మొత్తంగా భారత జట్టు ఏ ఒక్క మ్యాచ్ కూడా ఓడి పోకుండా అజేయంగా నిలిచింది. ఫైనల్లో కెప్టెన్ ప్రియాంక ఇంగ్లే జట్టును ముందుండి నడిపించింది. మ్యాచ్ మొత్తం ఏకపక్షంగా సాగింది.