మొట్టమొదటి ఖో ఖో ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళా జట్టుకు అభినందనలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ చారిత్రాత్మక విజయం వారి అసమాన నైపుణ్యం, దృఢ సంకల్పానికి ప్రతీకగా నిలిచిందన్నారు. ఈ అసాధారణమైన గెలుపు భారతదేశపు పురాతన సాంప్రదాయ క్రీడలలో ఒకదానికి మరింత గుర్తింపు తెచ్చి పెట్టేలా చేసిందన్నారు. దేశ వ్యాప్తంగా లెక్కలేనంతమంది యువ అథ్లెట్లకు స్ఫూర్తినిచ్చిందన్నారు.