తాగునీరు, పారిశుధ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం
NEWS Jan 19,2025 04:14 pm
నిజామాబాద్లో తాగునీరు, పారిశుధ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించేలా 400 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతోందని మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ వెల్లడించారు. మంచినీటి సరఫరా వ్యవస్థను మెరుగు పర్చేందుకు అమృత్ 2.0 పథకంలో భాగంగా రూ. 380 కోట్ల వ్యయంతో చేపడుతున్న పనులకు, వరద జలాలు నిలువకుండా చేపడుతున్న స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.