రేషన్ కార్డుల విషయంలో సమీక్ష చేసుకోవాలి
NEWS Jan 19,2025 04:16 pm
రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం పున: సమీక్ష చేసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధి సంక్షేమం పై జరిగిన సమీక్ష సమావేశంలో కవిత పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా నియోజకవర్గానికి 3500 ఇళ్లను ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు. రేషన్ కార్డుల విషయంలో నిజామాబాద్ లో మీసేవ ద్వారానే దాదాపు లక్ష 27వేల దరఖాస్తులు వచ్చాయన్నారు.