అభివృద్ధి పనులకు శంకుస్థాపన
NEWS Jan 19,2025 04:18 pm
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గోల్ హనుమాన్ దగ్గర 63 లక్షల 75 వేల రూపాయలతో మున్సిపల్ కార్పొరేషన్ జోన్ 2 కార్యాలయ భవనానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ లు ప్రారంభించారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం సంబందించిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త, మున్సిపల్ మేయర్ దండు నీతు కిరణ్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.