ప్రపంచ వ్యాప్తంగా యోగాకు ప్రాముఖ్యత
NEWS Jan 19,2025 04:18 pm
ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలలో యోగా కేంద్రాలు ఏర్పాటు అయ్యాయని, భారతదేశానికి వచ్చి యోగా నేర్చుకొని అక్కడ యోగాసనాలు నేర్పుతున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ పేర్కొన్నారు. ఎక్కొండ ప్రభాకర్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా అర్సపల్లిలో నిర్వహిస్తున్న వివేకానంద యోగా కేంద్రం రజతోత్సవ వేడుకలకు మధుయాష్కీ హాజరయ్యారు. నేటి ఆధునిక ప్రపంచంలో యోగా తప్పనిసరిగా మారిందన్నారు.