ఆదర్శనీయం ఈ యోగారత్నం
NEWS Jan 19,2025 06:25 pm
నేర్చుకోవాలనే తపన, సేవ చేయాలనే సంకల్పం, అందుకు తగిన కృషి, పట్టుదల, జిజ్ఞాస ఉంటే చాలు చిరకాలం గుర్తుండిపోయేలా సమాజానికి చాలా చేయొచ్చు. జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చు. ఇందూరు నగరానికి చెందిన ఎక్కొండ ప్రభాకర్ గత 41 ఏళ్లుగా ఈ దిశగా ముందుకెళుతూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. వేల మందికి యోగా నేర్పుతూ, వందల మంది యోగా మాస్టర్లను తయారు చేస్తూ ఆ స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు. ప్రభాకర్ సేవలకు గాను తన గురువు వెంకటేశం ద్వారా యోగా రత్న అవార్డు అందుకున్నారు.