హోం శాఖ లేఖపై చంద్రబాబు సీరియస్
NEWS Jan 19,2025 03:50 am
టీటీడీలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనలపై కేంద్ర హోం శాఖ సీరియస్ అయ్యింది. ప్రత్యేకంగా విచారణ చేపట్టనున్నట్లు లేఖ రాసింది. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షాతో ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతో తిరుమల వ్యవహారాలపై జోక్యం చేసుకోవద్దంటూ కేంద్ర హోం శాఖను ఆదేశించారు అమిత్ షా.