నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చిట్టిచివరి కౌన్సిల్ సమావేశం రసాభాసాగా మారింది. ప్రజా సమస్యలపై, నగరాభివృద్ధి పై చర్చించి అవసరమైన తీర్మానాలను చేయాల్సిన సమావేశంలో పార్టీల మధ్య ఆధిపత్యాన్ని చూయించుకునే ప్రయత్నాలే జరిగాయి. ప్రజా సమస్యలపై అంతగా శ్రద్ధను కనబరిచిన దాఖలాలు కనిపించలేదు. ఫలితంగా సమావేశంలో ఎలాంటి తీర్మాణాలు చేయకుండానే సమావేశాన్ని ముగించడంతో నగర ప్రజలకు మేలు జరగలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.