నిజామాబాద్ నగరం భగత్ సింగ్ కాలనీలోని డ్రైనేజీలో ఓ నవజాత మగ శిశువు లభ్యమైంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు శిశువును డ్రైనేజీలో పడవేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిజామాబాద్ ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ లో అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే ఆరో టౌన్ ఎస్సై ఫోన్ నెం. 8712659848 కు సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు.