పసుపు బోర్డు చైర్మన్ కు సన్మానం
NEWS Jan 19,2025 03:40 am
ప్రభుత్వం నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయడంతో బహుళ ప్ర యోజనాలు అందనున్నాయని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. బాధ్యతలు స్వీకరించిన పల్లె గంగారెడ్డిని పూలమాలలు, శాలువలతో సత్కరించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మ పురి అర్వింద్ ప్రత్యేక కృషితో కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డును ఏర్పాటు చేసిందన్నారు. పసుపు బోర్డు తొలిచైర్మన్గా తనను నియమించడం సంతోషకరమన్నారు.