హైదరాబాద్ లో అత్యాధునిక డేటా సెంటర్
NEWS Jan 19,2025 03:05 am
సింగపూర్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. కీలక సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. రూ. 3,500 కోట్ల పెట్టుబడులతో ఎస్టీ టెలీ మీడియా గ్లోబల్ డేటా సెంటర్ ను హైద్రాబాద్ లో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. ముచ్చర్ల సమీపంలోని మీర్ఖాన్పేటలో అత్యాధునిక వసతులతో క్యాంపస్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్బంగా సీఎం అభినందించారు.