అరవింద్ కేజ్రీవాల్ కాన్వాయ్పై దాడి
NEWS Jan 19,2025 01:25 am
ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లిన మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కాన్వాయ్ పై దాడి జరిగింది. బీజేపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ అనుచరులు కేజ్రీవాల్ ను అంతం చేసేందుకు కుట్ర పన్నారంటూ ఆప్ నేతలు ఆరోపించారు. దీనిని ఖండించింది బీజేపీ. కాన్వాయ్ కారు తమ పార్టీ కార్యకర్తలను ఢీకొట్టిందని, అందుకే దాడి చేయాల్సి వచ్చిందన్నారు పర్వీష్ వర్మ.