కొండగట్టు ఆలయ ఈవోగా శ్రీకాంత్ రావు బాధ్యతలు
NEWS Jan 18,2025 06:45 pm
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ నూతన ఈవోగా శ్రీకాంత్ రావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. కొండగట్టు ఈవోగా పనిచేసిన రామకృష్ణారావును సికింద్రాబాద్ లోని గణేష్ ఆలయానికి బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు వరంగల్ దేవాదాయ డిప్యూటీ కమిషనర్ గా విధులు నిర్వహించిన శ్రీకాంత్ రావు కొండగట్టు ఆలయ ఈవోగా బాధ్యతలు స్వీకరించి, ఆలయాన్ని, ఆలయ పరిసర ప్రాంతాలను కలియ తిరిగి పరిశీలించారు.