మెట్ పల్లి డివిజన్ పరిధిలో విద్యుత్ కు అంతరాయం
NEWS Jan 18,2025 06:32 pm
దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా, ట్రాన్స్ కో వారు పెంబట్ల - కోనాపూర్ 220/132కెవి సబ్ స్టేషన్ లో చేపడుతున్న లైన్-ఇన్, లైన్-ఔట్ టవర్ల నిర్మాణ పనుల ముగింపులో భాగంగా మెట్ పల్లి డివిజన్ పరిధిలో ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని మెట్ పల్లి డీఈ గంగారాం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా 132/33కెవి సబ్ స్టేషన్ గోదూరు, కోరుట్ల, కథలాపూర్ పరిధిలో ఉన్న 7 గ్రామీణ మండలాల్లో ఆదివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సింగిల్ ఫేజ్ సరఫరా మాత్రమే కొనసాగించనున్నారు.