రత్నాపూర్ గ్రామ వాసికి పిహెచ్డి డాక్టరేట్
NEWS Jan 18,2025 11:53 am
మల్లాపూర్ మండలం రత్నాపూర్ గ్రామానికీ చెందిన బాస మధుకి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అర్థశాస్త్ర విభాగంలో తెలంగాణలో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ద్వారా ఆర్థిక సమ్మిళితం అనే సమస్య అధ్యయనంపై గౌరవ డాక్టరేట్ లభించింది. 2017 లో పీహెచ్డీ మొదటి ర్యాంక్ సాధించి ఆ తరువాత వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినప్పటికీ తన గురువుల ప్రోత్సహoవల్లే పీహెచ్డీ పూర్తి చేసి అవార్డు లభించిందని అతను తెలియజేశారు. మెట్ పల్లి తహసీల్దార్ కార్యాలయంలో మండల గణంక అధికారిగా విధులు కొనసాగిస్తున్నారు.