పేద ప్రజల దేవుడు ఎన్టీఆర్
NEWS Jan 18,2025 12:20 pm
మడకశిర పట్టణంలో నట సార్వభౌములు నందమూరి తారక రామారావు వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మడకశిర తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మాట్లాడుతూ.. తారక రాముడు తెలుగు ప్రజల గుండెచప్పుడు, రూ. 2 రూపాయలకే కిలో బియ్యం పేద ప్రజలకు పంపిణీ చేసిన మహోన్నత వ్యక్తి అన్నారు. ఆంధ్రుల ఆరాధ్య దైవం అంటూ కొనియాడారు.