అవయవ దానం చేసిన వ్యక్తి కుటుంబానికి జీవన్దాన్ ట్రస్టు ప్రశంస పత్రాన్ని అందజేసింది. బిక్కనూరు మండలం తిప్పాపూర్కు చెందిన కడర్ల నడిపోల్ల బాలమల్లు గతనెల 12న ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 14న మృతిచెందాడు. జీవన్దాన్ ట్రస్టు ప్రతినిధులు మృతుడి కుటుంబ సభ్యులను కలిసి అవయవదానంపై అవగాహన కల్పించారు. జీవన్దాన్ ట్రస్టు ప్రతినిధి శివకుమార్ గ్రామానికి వచ్చి బాలమల్లు భార్య అంజమ్మను సన్మానించి ఆమెకు ప్రశంస పత్రం అందించారు.